మసీదు నిర్మాణానికి 50 లక్షల రూపాయల భారీ విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్

Spread the love

సాక్షిత అమీన్పూర్ : వాణి నగర్ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 10 లక్షల రూపాయల విరాళం
కుల మతాలకు అతీతంగా అన్ని ప్రార్థన దేవాలయాల అభివృద్ధికి, నూతన నిర్మాణాలకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విరాళాల పరంపర కొనసాగుతూనే ఉంది.

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని రెండో వార్డులో మున్సిపల్ కార్యాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన మస్జిద్ ఏ అమీనా అలంగీర్ నిర్మాణానికి గతంలో ఇచ్చిన హామీ మేరకు మొదటి విడతగా 20 లక్షల రూపాయలు అందించగా, మరో 30 లక్షల రూపాయలు అందించారు. ముత్త మసీదు నిర్మాణానికి 50 లక్షల రూపాయల భారీ విరాళాన్ని తన దైవభక్తిని, మతసామరస్యాన్ని చాటుకున్నారు. భవిష్యత్తులను మసీదు అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు

అనంతరం వాణి నగర్ కాలనీలో నూతనంగా నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 10 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మసీదు కమిటీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page