బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులు

Spread the love

బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులు..
మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని..


సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు. పరమశివుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను సన్మానించారు. హాజరైన మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు.

Related Posts

You cannot copy content of this page