నేషనల్ హైవే సమస్యలపై వెంటనే స్పందించినందుకు కేంద్ర మంత్రి నితిన్ గెట్కారి కి రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ కి కృతజ్ఞతలు

Spread the love

మేడ్చల్ జిల్లా ఉమ్మడి ఘట్కేసర్ మండలంలోని నేషనల్ హైవే సమస్యలపై బిజెపి కంటెస్టెంట్ ఎమ్మెల్యే, రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు, ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి జాతీయ రహదారి డిప్యూటీ మేనేజర్ నవకాంత్ తో కలిసి ఘట్కేసర్ మైసమ్మగుట్ట క్రాస్ రోడ్డు,అన్నోజిగూడా ఎన్టీపీసీ క్రాస్ రోడ్డు అండర్ పాస్, అంకుషాపూర్ మరియు ఔషపూర్ బ్రిడ్జ్ ల నిర్మాణస్థలని పరిశీలించారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ని ఢిల్లీలో కలసి వినతి పత్రం అందజేసిన వెంటనే స్పందించి అంకుషాపూర్ అండర్ పాస్ బ్రిడ్జ్ (pup) మంజూరు చేసినందుకు మరియు ఎన్ టి పి సి చౌరస్తా వద్ద అండర్ పాస్ మరియు ఘట్కేసర్ చౌరస్తా గట్టు మైసమ్మ దగ్గర అండర్ పాస్ నిర్మాణానికి స్పందించారు అతి త్వరలో ఇట్టి పనులకు ప్రారంభిస్తామని అధికారులు తెలియజేశారు ఇంత త్వరగా స్పందించి అధికారులను పంపినందుకు కేంద్ర రహదారుల మంత్రివర్యులు నితిన్ గట్కారి కి,ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page