వైఎస్సార్సీపీ విజయానికి అందరం బాధ్యతాయుతంగా పనిచేద్దాం.. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి

Spread the love

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి ప్రతి ఒక్కరం బాధ్యతాయుతంగా పనిచేద్దామని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని 15వ వార్డుకు చెందిన యువత పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ నాయకులు దాల్మిల్ అమీర్, సాయిరాం రెడ్డి,దాదా,కత్తి ఆద్వర్యంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ నుండి దాదాపు 100 మంది యువకులు వైసీపీలో చేరడం జరిగింది. యువత తమ శక్తి సామర్థ్యాలను పార్టీ భలోపేతానికి, విజయానికి అందించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మీజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ… ఈనెల 28వ తేది నంద్యాల పట్టణంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న మేమంతా సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యువత తమ శక్తి సామర్థ్యాలను పార్టీ విజయానికి వినియోగించాలని అనేక మందిని పార్టీ వైపు ఆకర్షించి ఓటు బ్యాంక్ గా మలచాలని కోరారు. జగన్ మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల సందర్భంగా విడుదల చేయనున్న మేనిఫెస్టోలో యువతకు తగిన అవకాశాలను, ప్రాధాన్యతను కల్పిస్తారని ఆకాంక్షించారు. పార్టీలో ఉత్సాహంగా పాల్గొనాలని, చివరి వరకు పోరాడం చేసి నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి విజయానికి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి విజయానికి కృషిచేయాలని కోరారు. పార్టీ లో చేరిన వారిలో శ్రీనాథ్, అక్రమ్, వినోద్, ఖాజ, సుధీర్, నాని, నాయాబ్, ఇర్ఫాన్, పవన్, గణేష్, మిత్రులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page