సీనియర్ జర్నలిస్ట్ మాదిరాజు రామ్మూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనసభ్యులు డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

Spread the love

సీనియర్ జర్నలిస్ట్ మాదిరాజు రామ్మూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనసభ్యులు డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

రొంపిచర్ల
మండల కేంద్రమైన రొంపిచర్లలో నరసరావుపేట శాసనసభ్యులు డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. గ్రామానికి విచ్చేసిన ఆయనకు వైసిపి నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలో కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ మాదిరాజు రామ్మూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండలంలో విలేకరిగా రామ్మూర్తి చేసిన సేవలను కొనియాడారు. తమ కుటుంబమునకు, మూర్తి కుటుంబమునకు గల అవినాభావ సంబంధం గురించి వివరించారు. ఆయన మృతి జీర్ణించుకోలేదని అన్నారు.

ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుండి ఆర్ధిక సహాయం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పిల్లి ఓబుల్ రెడ్డి, మార్కెట్ యార్డు ఛైర్మన్ పచ్చవ రవీంద్రబాబు, మాజీ ఛైర్మన్ గెల్లి సుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్ గెల్లి చినకోటిరెడ్డి, వైసిపి పల్నాడు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పడాల శివారెడ్డి, వైసిపి మండల నాయకులు చపరప్ సంజీవరెడ్డి,మేడికొండ రవీంద్రారెడ్డి, శ్రీనివాస రెడ్డి, అన్నెం పున్నారెడ్డి, తదితరులు పాల్గొన్నారు

_అనంతరం సంతగుడిపాడు గ్రామంలో యారబోలు శ్రీనివాసరెడ్డి కి నివాళులు అర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు*

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page