కార్మిక,కర్షక,జవాన్ లే ఈ దేశానికి వెన్నెముక

Spread the love

మే డే వేడుకల్లో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి


సాక్షిత : మే డే దినోత్సవాన్ని పురస్కరించుకుని గుండ్ల పోచంపల్లి లోని అపెరెల్ పార్క్ వద్ద ఐయన్టీయూసి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కావేరి శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో *మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి * పాల్గొని జెండా ఆవిష్కరణ చేసి కార్మికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ దేశానికి కార్మికులు, కర్షకులు,జవాన్ లే వెన్నెముక అని, కార్మికుల చెమట చుక్కలతోనే ఈ దేశం ముందుకు వెళ్తుందని, వారు స్వేదం చిందించి ఈ దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారని,ఎందరో కార్మికులు తమ రక్తం చిందించి,ప్రాణాలను అర్పించి కార్మిక లోకానికి హక్కులను సాధించి పెట్టారని, మరొక్కసారి కార్మికులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో గుండ్ల పోచంపల్లి మాజీ సర్పంచ్ బండారి నరేందర్ ముదిరాజ్, ఐయన్టీయూసి రాష్ట్ర కార్యదర్శి అమరం, సురేష్ రెడ్డి, దొడ్ల మోహన్, మరియమ్మ మరియు మున్సిపల్ నాయకులు,కార్మిక సోదరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page