ఖేలో ఇండియా ఉమెన్స్ సైక్లింగ్’ సౌత్ జోన్ ఛాంపియన్ షిప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే…

Spread the love

ఖేలో ఇండియా ఉమెన్స్ సైక్లింగ్’ సౌత్ జోన్ ఛాంపియన్ షిప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే…


సాక్షిత : యూత్ అఫైర్స్ & స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ చేపట్టిన ఖేలో ఇండియా స్కీమ్ లో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దుండిగల్ ఎంఎల్ఆర్ఐటీ వద్ద 18, 19వ తేదీలలో నిర్వహిస్తున్న ‘ఖేలో ఇండియా ఉమెన్స్ సైక్లింగ్’ సౌత్ జోన్ ఛాంపియన్‌షిప్ ను ఈరోజు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎంఎల్ఆర్ఐటీ అధినేత డాక్టర్ మర్రి లక్ష్మణ్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. 16-18 ఏళ్లకు పైగా వయస్సు గల యువతులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందించారు. సైక్లింగ్ క్రీడలలో యువతులు, మహిళలను ప్రోత్సహించే ఉద్దేశంతో చేపట్టిన ఖేలో ఇండియా ఉమెన్స్ సైక్లింగ్ ఛాంపియన్ షిప్ ను తన చేతుల మీదుగా ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కో-ఆర్డినేటర్ సౌత్ జోన్ డా.మాక్స్‌వెల్ ట్రెవర్, అడిషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.కె.పాష మరియు కౌన్సిలర్ జక్కుల కృష్ణా యాదవ్, దుండిగల్ రైడర్స్ భీమ్ సింగ్, ప్రవీణ్ గడిల, జగన్ నాయక్, హాజి, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page