ఎంపీ నిధులతో అంబులెన్స్ లు అందచేసిన కేశినేని శ్రీనివాస్ (నాని)

Spread the love

విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అభ్యర్థన మేరకు ప్రజల వైద్య అవసరాల కోసం రూ.70.00 లక్షల కేశినేని నాని ఎంపీ నిధుల నుండి మంజూరు చేసిన 2 అంబులెన్స్ లను ప్రభుత్వ వైద్యాధికారులకు అందచేసిన కార్యక్రమంలో

ఏపీ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్, ఎమ్మెల్యే శ్రీ.మల్లాది విష్ణు , తూర్పు నియోజకవర్గ వైయస్సార్సీపీ ఇంచార్జ్ శ్రీ.దేవినేని అవినాష్ , ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు తో కలిసి పాల్గొన్న విజయవాడ పార్లమెంట్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని)

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ

కలెక్టర్ ఢిల్లీ రావు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం అంబులెన్స్ లు కావాలని చెప్పిన మేరకు నా ఎంపీ నిధుల నుండి రూ.70 లక్షలు కేటాయించి త్వరితగతిన ఏర్పాటు చేయవలసిందిగా కోరాను

ఈ రోజు రూ.55.00 లక్షలతోనే అతి తక్కువ ఖర్చుతో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అత్యవసర పరికరాలతో 2 అంబులెన్స్ లను అందుబాటులోకి తెచ్చి, ప్రారంభించుకున్నాం

మిగిలిన రూ.15.00 లక్షలతో మరో 2 మినీ అంబులెన్స్ లను కూడా కొద్దీ రోజుల్లోనే అందుబాటులోకి తీసుకువస్తాము

ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు నా దృష్టికి వచ్చి వాటి పరిష్కర దిశగా కృషి చేస్తున్న ఢిల్లీ రావు కి ప్రత్యేక అభినందనలు

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవళిక , ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు , డిప్యూటీ ఆర్ఎంఓ మంగాదేవి సి.ఎస్.ఆర్.ఎం.ఓ పద్మావతి డిప్యూటీ సిఎస్ఆర్ మెడికల్ ఆఫీసర్ శోభ ,విజయవాడ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ లింగమనేని శివరాం ప్రసాద్ , వెలగలేటి భార్గవరాయుడు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page