వికలాంగులకు మరో వెయ్యి రూపాయలు అదనంగా పింఛను పెంచిన నేపథ్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Spread the love

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కేపీహెచ్బీ డివిజన్ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వికలాంగులకు మరో వెయ్యి రూపాయలు అదనంగా పింఛను పెంచిన నేపథ్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.. అనంతరం వికలాంగులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భంగా కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం పదేళ్ల కాలంలో వందేళ్ల అభివృద్ధి సాధించిందని నేడు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళుతున్నాయని అన్నారు

… ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకుడిని తిరిగి ప్రజలు మళ్లీ ఎన్నుకుంటారని ఆశా భావం వ్యక్తం చేశారు.. అలాగే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో కూకట్పల్లి నియోజకవర్గం ఆదర్శ నియోజకవర్గంగా మారిందని ..నేడు అన్ని మౌలిక సదుపాయాలతో ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారని అన్నారు …ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ,జనరల్ సెక్రటరీ రాజేష్, హనుమంతరావు ,రాంబాబు నాయుడు, పాతూరి గోపి, భవాని, భారతి ,రమాదేవి, లతా ,పద్మా రెడ్డి, వెంకట్ రెడ్డి హేమ తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page