దివ్యాంగులకు దేవుడు KCR కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి

Spread the love

దివ్యాంగులకు దేవుడు KCR…కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా ప్రకటన పట్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో వికలాంగులతో కలిసి ముఖ్యమంత్రి KCR గారికి, మరియు మంత్రి KTR గారికి పాలభిషేకం చేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వికలాంగులకు ₹3116 పెన్షన్ ను మరో వెయ్యి రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వచ్చే నెల నుంచి ఈ పెన్షన్ అందరికీ అందుతుంది అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో అందరి సంక్షేమం ముఖ్యంగా వికలాంగుల సంక్షేమం నేను చూసుకుంటా అంటూ కేసిఆర్ మంచిర్యాల సభలో భరోసా ఇచ్చారు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ సంఘం సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page