సనత్ నగర్ నియోజకవర్గంలో అడుగడుగునా పద్మారావు గౌడ్ కి బ్రహ్మరథం పట్టిన కార్యకర్తలు, నాయకులు….

Spread the love

సాక్షిత సికింద్రాబాద్ పార్లమెంట్ పాదయాత్ర :-
సనత్ నగర్ నియోజకవర్గంలో అడుగడుగునా పద్మారావు గౌడ్ కి బ్రహ్మరథం పట్టిన కార్యకర్తలు, నాయకులు….

సికింద్రాబాద్ పార్లమెంట్ లో బి.ఆర్.ఎస్ జెండా ఎగరవేస్తాం…


సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గంలోని మొండా మార్కెట్ డివిజన్ లోని సజ్జన్ లాల్ స్ట్రీట్ , పాట్ మార్కెట్ , ఆదయ్య నగర్ , పలు కాలనిలలో మాజీ మంత్రి , ఎం.ఎల్.ఏ తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఎన్నికల పాదయాత్ర ను కొనసాగించిన ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్…

ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు రామేశ్వర్ గౌడ్ , మాజీ కార్పొరేటర్ ఆకుల రూపహరి , స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు….

అనంతరం ఎం.ఎల్.ఏ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పద్మారావు గౌడ్ అంటే నే ఒక బ్రాండ్ …పద్మారావు గౌడ్ ఒక్క హైదరాబాద్ లోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితుడు. సికింద్రాబాద్ పార్లమెంట్ లో బి.ఆర్.ఎస్ జెండా ఎగరవేస్తాం.మొన్న ప్యాట్నీ లో సీఎం రేవంత్ రెడ్డి పద్మారావు గౌడ్ ని
బలి పశువు చేసిండ్రు కేసీఆర్ అని అన్నాడు. వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి పద్మారావు గౌడ్ అంటే ఒక చరిత్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మొదటి రోజు నుండి కోట్లాడి పోరాడిన వ్యక్తి అలాంటి వ్యక్తిని పట్టుకొని అలా అనడం సరైనది కాదు.
రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం మేము కూడా ఒడి గెలిచినం.
మహంకాళి ఆలయంలో బోనాలు పూజలు చేసేది మేమే. క్రిస్మస్ , రంజాన్ లాంటి పండుగలను ఘనంగా చేయలేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.కాబట్టి సికింద్రాబాద్ లో బి.ఆర్.ఎస్ పార్టీ కి ఓటు వేసి పద్మారావు గౌడ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం.

Related Posts

You cannot copy content of this page