ప్రగతి నగర్ రోడ్, ఆంబీర్ చెరువు వద్ద ఉన్న కొలనులో వినాయక విగ్రహాల నిమజ్జన

Spread the love

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్ రోడ్, ఆంబీర్ చెరువు వద్ద ఉన్న కొలనులో వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పట్లను కేపిహెచ్బి సీఐ కిషన్ కుమార్ , సెక్టార్ ఎస్ఐ రాజేంద్ర మరియు జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . ఈ సందర్భంగా శ్రీనివాస రావు మాట్లాడుతూ, వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది అని, ప్రజలు అందరూ నిభందనలు ప్రకారం అధికారుల సూచనలతో తగు జాగ్రతలతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏ ఈ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page