ఎమ్మెల్యే కొడాలి నానిపై ఫైర్ అయిన గుడివాడ టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము ఫైర్

Spread the love

సచివాలయాన్ని తాకట్టు పెడితే తప్పేంటంటున్న, కొడాలి నాని లాంటి సన్నాసులకు కరెక్ట్ పార్టీ వైసిపినే.

వెనిగండ్ల రాము పాయింట్స్

అమరావతి అంత గ్రాఫిక్స్ అన్నారు ఇప్పుడు 370 కోట్ల రుణం ఎలా తెచ్చారు.వైసిపి ఎమ్మెల్యేలు,మంత్రులు చెప్పే ప్రతి మాట అబద్ధమే.

దారుణంగా వైసీపీ ప్రభుత్వ పాలన సాగుతుంది, ఇక గుడివాడ ఎమ్మెల్యే గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

మహిళ మెడలో పుస్తెలతాడును ఎంత పవిత్రంగా భావిస్తారో,రాష్ట్రానికి సచివాలయం అంత పవిత్రమైనది.

అటువంటి సచివాలయాన్ని తాకట్టు పెడితే తప్పేంటంటు కొడాలి నాని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు.

దేన్నైనా మూర్ఖంగా ముందుకు తీసుకెళ్లడమే వైసిపి నాయకులకు అలవాటు,ప్రజల మనోభావాలతో వారికి సంబంధం లేదు.

గుడివాడలో ప్రజలకు త్రాగునీరు, రోడ్లు లేక అల్లాడుతుంటే వాటిపై స్పందన ఉండదు.

జాతీయ నాయకుడల్లే ఏదేదో మాట్లాడుతాడు, పనికిమాలిన ఎమ్మెల్యే కొడాలి నాని.

రేపొద్దున ప్రజలు ఉఫ్ అని ఉదితే కొడాలి నాని ఎగిరిపోబోతున్నాడు.

పవన్ కళ్యాణ్ అభిమానులపై శ్రద్ధ చూపిస్తున్నట్లు, ఆయనను అనరాని మాటలు అంటున్నాడు.

ప్రతి మాటకు సమాధానం చెప్పక తప్పదు.

కొడాలి నాని బ్రతుకే అబద్ధాలు,మోసాలంతో నిండింది.

ఇలాంటి సన్నాసులకు కరెక్ట్ పార్టీ వైసిపి నే.

వైసీపీ పార్టీ మొత్తం భూస్థాపితం కాబోతుంది.

Related Posts

You cannot copy content of this page