ఉచిత వైద్య శిబిరాలు పేదలకు వరం బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి .

Spread the love

సాక్షిత : మల్లారెడ్డి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిభిరం స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి తెలిపారు.
బాలానగర్ డివిజన్ పరిధిలోని శ్రీశ్రీ నగర్ లో మల్లారెడ్డి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా శిబిరానికి వచ్చిన రోగులకు గుండె, కంటి, దంత, షుగర్‌, బీపీ, గర్భ,చర్మ సంబంధిత వ్యాధులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మారిన జీవనశైలితోపాటు పర్యావరణంలో వస్తున్న అనేక మార్పుల వల్ల ప్రజలు అనేక వ్యాధులకు గురవుతున్నారన్నారు. ప్రతి ఒక్కరు నిత్యం వ్యాయామం, మెడిటేషన్, యోగ, ధ్యానం, నడకలాంటి వాటికి ప్రతి ఉదయం మంచి సమయాన్ని కేటాయించాలన్నారు.

ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి హాస్పిటల్స్ సిబ్బంది డాక్టర్ శ్రీ సాయి సవిత,డాక్టర్ పి. సాహితి రెడ్డి,డాక్టర్ మౌనిక,డాక్టర్ దివ్య,డాక్టర్ అంజనా, డాక్టర్ శ్రీవాణి తోపాటు BRS పార్టీ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఖాజా,నాయకులు మొహమ్మద్ సోఫీ,దుర్గేష్ ముదిరాజ్,మొగుడంపల్లి కిరణ్,కందుల రమేష్,షాహిదా బేగం,నయీమునిస్సా,అంజమ్మ,యాదమ్మ,మంజుల,శ్రీ శ్రీ నగర్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లికార్జున చారీ తదితరులు పాల్గొనడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page