నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్లు మరియు ఫూట్ ఫాత్ నిర్మాణం పనులకు శంకుస్థాపన

Spread the love

కొండాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో 5 కోట్ల 41 లక్షల 50 వేల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్లు మరియు ఫూట్ ఫాత్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ A బ్లాక్, రాఘవేంద్ర కాలనీ C బ్లాక్, రాజరాజేశ్వరి కాలనీ,గోల్డెన్ తులిప్, ఓయూ కాలనీ,JV హిల్స్ కాలనీ,గచ్చిబౌలి ప్రధాన రహదారి కిరువైపుల ఫూట్ ఫాత్ నిర్మాణం, మాదాపూర్ విలేజ్, అమర్ సొసైటీ కాలనీలలో రూ.05 కోట్ల 41 లక్షల 50 వేల రూపాయల అంచనావ్యయంతో చెపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, ఫుట్ ఫాత్ నిర్మాణం పనులకు కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా కొండాపూర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ ఈ రోజు సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, ఫూట్ ఫాత్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాల సంతోషకరం అని అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని ,సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్ఘాటించారు.

శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు :

*మంజూరైన అభివృధి పనుల వివరాలు….

1.ప్రేమ్ నగర్ A బ్లాక్ కాలనీలో రూ. 90.00 లక్షల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు.

2.రాఘవేంద్ర కాలనీ C బ్లాక్ కాలనీలో రూ.30.00 లక్షల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు.

3.రాజరాజేశ్వరి కాలనీలో రూ. 40.00 లక్షల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు.

4.గోల్డెన్ తులిప్, O.U కాలనీ, J. V హిల్స్ కాలనీలో రూ. 104.50 లక్షల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు.

5.గచ్చిబౌలి ప్రధాన రహదారి పై ( గచ్చిబౌలి విధి No 2 నుండి బొటానికల్ గార్డెన్ జంక్షన్ వరకు నూతనంగా చేపట్టబోయే ఫూట్ ఫాత్ నిర్మాణం మరియు ఆదిత్య హైట్స్ నుండి PJ R నగర్ వరకు నూతనంగా చేపట్టబోయే ఫూట్ ఫాత్ నిర్మాణం) రూ.229.00 లక్షల రూపాయలఅంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే ఫూట్ ఫాత్ నిర్మాణ పనులకు.

6.మాదాపూర్ విలేజ్ మరియు అమర్ సొసైటీ కాలనీలో రూ. 48.00 లక్షల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు.

పైన పేర్కొన్న సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, ఫూట్ ఫాత్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు పెరుక రమేష్ పటేల్, సీనియర్ నాయకులు రక్తపు జంగం గౌడ్, రూపరెడ్డి, శ్రీనివాస్ చౌదరి, కే నిర్మల, మీనా భి, నరసింహ సాగర్, మల్లెల శ్రీనివాస్ యాదవ్, రాజు యాదవ్, శ్రవణ్ యాదవ్, బద్దం శాస్త్రి యాదవ్, సిల్వర్ కుమ్మరి శ్రీనివాస్, ఇంద్రాసేన ముదిరాజ్, సిల్వర్ విష్ణు, రాము ముదిరాజ్, మల్లెల ఐలేష్ యాదవ్, మహేష్ యాదవ్, విక్రమ్, బాలిరెడ్డి, జూపల్లి శ్రీనివాస్, ఎస్వీఎన్ రాజు, మంగళరాపు తిరుపతి పటేల్, రజనీకాంత్, డా రమేష్, మంగమ్మ, తిరుపతి యాదవ్,రాజరాజేశ్వరి కాలనీ వైస్ ప్రెసిడెంట్ మధు ముదిరాజ్, శ్రీనివాస్ ముదిరాజ్, అజయ్ సింగ్, శీను ముదిరాజ్, విశ్వేశ్వరరావు, సత్యనారాయణ రెడ్డి,అనిల్, సత్య ప్రసాద్, విజయ్, శివ ముదిరాజ్, సంతోష్, నరేష్ ముదిరాజ్, కచ్చావా దీపక్, సయ్యద్ ఉస్మాన్, హిమమ్, అజయ్, సంతోష్, వివి రావు, హనుమంతు రావు, భగవాన్ దాస్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page