శ్రీ పరశురామ జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ …

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: శ్రీ పరుశరామ జయంతి సందర్భంగా జగద్గిరిగుట్ట లోని శ్రీ పరుశరామ ఆలయంలో జరిగిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పురాణ పురుషుడి అవతారంగా కీర్తించబడిన పరుశరాముని పరాక్రమ జీవనం ఆదర్శనీయమని మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు పున్నా రెడ్డి, నిర్వాహకులు రాంగోపాల్ చౌదరి, సునీల్ సింగ్,మనవేందర్ మిశ్రా, సుజిత్ ఠాగూర్, సౌరబ్ సింగ్, మోహన్ కుమార్, శత్రుఘన్ సింగ్, భూషణ్ సింగ్, భక్తులు, బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page