గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలను పార్టీ కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది

Spread the love

కూకట్ పల్లి నియోజకవర్గ బ్లాక్, డివిజన్ అధ్యక్షుల సమావేశంలో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి

మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల ప్రచారం, పార్టీ గెలుపు కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు, కార్యాచరణపై కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బ్లాక్, డివిజన్, సీనియర్ నాయకుల సమావేశం నియోజకవర్గ ఇంఛార్జ్ బండి రమేష్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి హాజరై నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ గత 10 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలను పార్టీ కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని, ఎవరూ ఎటువంటి అపోహలకు గురికావొద్దని, పార్టీలోకి కొత్తగా వస్తున్న నాయకులను, కార్యకర్తలను మనస్ఫూర్తిగా ఆహ్వానించి పాత, కొత్తవారు కలసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ,పనితీరు ఆధారంగానే పార్టీలో పదవులు వస్తుంటాయని, ఎవరూ తమని తాము తక్కువ అంచనా వేసుకోవద్దని, ఎవరికి ఉండే ప్రాముఖ్యత వారికి ఉంటుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఈ పార్లమెంటు పరిధిలో ఏ నాయకుడి గురించి పరిచయం చేయవలసిన అవసరం లేదని, అందరి బయోడేటా ముఖ్యమంత్రి దగ్గర ఉందని, అందుకని ఎవరూ అపోహలకు గురికావద్దని, మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం మనందరం తీవ్రంగా కృషి చేయవలసిన అవసరం ఉందని, నియోజకవర్గంలో అందరూ సమన్వయం చేసుకొని నియోజకవర్గ ఇంఛార్జ్ బండి రమేష్ నేతృత్వంలో కష్టపడి పనిచేసి అభ్యర్థి గెలుపునకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో పార్లమెంటు ఎన్నికల నియోజకవర్గ కోఆర్డినేటర్ వినయ్ రెడ్డి, నాయకులు సత్యం శ్రీరంగం,ఏ, బి బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి, వేణు మరియు అన్ని డివిజన్ ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page