కాలనీ పరిధిలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు నమోదు

Spread the love

Enrollment of voting rights for everyone in the colony who has completed 18 years of age

124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తన కార్యాలయంలో డివిజన్ తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, డివిజన్ కమిటీ మరియు అనుబంధ కమిటీ సభ్యులతో సమావేశం అవ్వడం జరిగింది.

కార్యక్రమంలో కార్పొరేటర్ మాట్లాడుతూ కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని మీ కాలనీ పరిధిలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు నమోదు చేయించాలని అన్నారు.

అలాగే ఓటర్ కార్డులో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే వాటిని కూడా సవరణ కొరకు దరఖాస్తు చేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం, ఓటు హక్కుకు యువత దూరమైతే ప్రజాస్వామ్యానికి సరైన న్యాయం జరగదు కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుని వారి ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, డివిజన్ కమిటీ మరియు అనుబంధ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page