భక్తుల సౌకర్యార్థం ఆలయ అభివృద్ధి

Spread the love

సాక్షిత : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని మధురనగర్ లో గల శ్రీ శ్రీ శ్రీ ఎదురుగడ్డల మైసమ్మ అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేయబోయే వాచ్ మెన్ రూమ్ కి మరియు దేవస్థానం ప్రహరీ గోడ నిర్మాణం కొరకు మాజీ కార్పొరేటర్ సాయి బాబా తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రజల మరియు భక్తుల సౌకర్యార్థం ఆలయ అభివృద్ధి కి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళల ఉంటాయి అని,ఆలయ అభివృద్ధికి విశేషం గా కృషి చేస్తానని, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, సోమేశ్వర దేవస్థానం చైర్మన్ చెన్నం రాజు తెరాస నాయకులు నరేశ్, జంగయ్య యాదవ్,రమేష్ గౌడ్,జగదీష్, రావులకొలు గోవింద్, అంజమ్మ, ఏరియా కమిటీ సభ్యులు నాగపూరి అశోక్ యాదవ్,శామ్లెట్ శ్రీనివాస్, అనిల్ సింగ్,మధు, నాగేష్,ప్రభాకర్, సుగుణ, బాలమణి, మాధవి గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page