బీసీల అభివృద్ధి, సంక్షేమం టిడిపి తోనే సాధ్యం; ఉమామహేశ్వర నాయుడు

Spread the love

బీసీల అభివృద్ధి ,సంక్షేమం టిడిపి తోనే సాధ్యమని కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు అన్నారు. 06-02-2024 న అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో కళ్యాణదుర్గం రూరల్ మరియు మున్సిపాలిటీ పరిధిలో జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ఆవుల కృష్ణయ్య ఆధ్వర్యంలో జయహో బీసీ సమావేశం నిర్వహించారు. ముందుగ కళ్యాణదుర్గం పట్టణంలోని ఎన్టీఆర్ భవన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి అనంతరం భారీ ర్యాలీగా ‘టీ’ కూడలిలోనీ పాత మార్కెట్ ప్రాంగణంలో ఎర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

ఈ కార్యక్రమానికి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు ముఖ్య అథిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ టిడిపి అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు అన్ని విధాల పెద్దపీట వేసిందన్నారు.దేశంలో బీసీలకు రాజకీయ ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలియజేసారు.వైసిపి ప్రభుత్వం బీసీల ఓట్లతో గద్దెనెక్కి బీసీలకు మొండి చేయి చూపిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి పార్టీకి బీసీల సత్తా ఏంటో ఓట్ల రూపంలో చూపి వైసిపిని బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కార్పొరేషన్లు ప్రవేశపెట్టి బీసీల అభ్యున్నతికి కృషి చేశారని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు నాగేశ్వరరావు యాదవ్, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, క్లస్టర్ ఇంచార్జ్ తలారి సత్యప్ప,కళ్యాణదుర్గం మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి గోవిందరాజులు,రాష్ట్ర గాండ్ల సాధికారిత కమిటీ అధ్యక్షురాలు విశాలాక్షి, సాధికారిక సభ్యులు కుమ్మర ఒబులపతి, బ్యాళ్ల నాగేంద్ర, యాదవ్ సంఘం శేషు యాదవ్, వాల్మీకి సంఘం నాయకులు కొయ్యగుర పెద్దన్న,చౌడయ్య, మాజీ ఎంపీపీ మాధవి, టిడిపి&జనసేన నాయకులు,కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page