సీసీ రోడ్లు, పార్క్ ప్రహరీ గోడ నిర్మాణ o

Spread the love
Corporator for construction of CC roads, park guard wall

సాక్షిత : వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని మాధవరం కాలనీ, ఆల్విన్ కాలనీ ఫేస్ -1,వెంకటేశ్వర్ నగర్ 34,35 బ్లాక్ లలో, GV హైట్స్ పార్క్ ,రిక్షాపులర్స్ (RP), కాలనీ లలో రూ. (230.12 లక్షలు) రెండు కోట్ల ముప్పై లక్షల పన్నెండు వేల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్లు, పార్క్ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు కార్పొరేటర్ శ్రీమతి రోజాదేవి రంగరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఒకవైపు కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో అభివుద్ది ఆగకూడదనే ఉద్దేశ్యం తో సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

అదేవిధంగా వివేకానంద నగర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ సీసీ రోడ్లు, ప్రహారి గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాల సంతోషకరం అని అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని ,సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని, పార్క్ లను అభివృద్ధి చేసి ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది.

పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది.

నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్ఘాటించారు.

శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు :

*మంజూరైన అభివృధి పనుల వివరాలు…*

1.వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని మాధవరం కాలనీ, ఆల్విన్ కాలనీ ఫేస్-1 కాలనీల లో రూ. 72.81 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులు

2.వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ 34, 35 బ్లాక్ లలో రూ. 106.81 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులు

3.వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని రిక్షా పుల్లర్స్ (RP) కాలనీ లో రూ. 25.00 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులు

4.వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ GV హైట్స్ పార్క్ లో రూ. 25.50 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే పార్క్ ప్రహారి గోడ నిర్మాణ పనులు, పార్క్ లో చిన్న పిల్లల ఆటవస్తువులు ప్రాంగణం ప్రారంభోత్సవం.

పైన పేర్కొన్న సీసీ రోడ్లు, పార్క్ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి తెరాస నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు, కార్తిక్ రావు,హరినాథ్, అల్లం మహేష్, చంద్రమౌళి సాగర్,ఆంజనేయులు, విద్య సాగర్,బాబు రావు,అంజి రెడ్డి, బాబు, రాజు,లక్ష్మీనర్సయ్య, రమణ రెడ్డి,ఎర్ర లక్ష్మయ్య, సురేష్ లింగయ్య, గిరి బాబు,ప్రవీణ్ ,శ్రావణి రెడ్డి,రాజ్యలక్ష్మి, పెంటమ్మ కార్యకర్తలు, మహిళ నాయకులు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు ,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page