శ్రీకాకుళం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్ధాపనలు.

Spread the love

సాక్షిత : సంతబొమ్మాళి మండలంలో రూ.4,362 కోట్లతో మూలపేట పోర్టు పనులకు భూమి పూజ చేసిన సీఎం వైయస్‌.జగన్‌.
గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి.
నౌపడ జంక్షన్‌లో జరిగన బహిరంగసభలో ప్రసంగించిన సీఎం వైయస్‌.జగన్‌.
ఎచ్చర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో రూ.365.81 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌కు, గొట్టా బ్యారేజ్‌ నుంచి హిరమండలం రిజర్వాయర్‌కు రూ.176.35 కోట్లతో వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు, రూ.852 కోట్ల వ్యయంతో మహేంద్ర తనయ ప్రాజెక్టు ఆఫ్‌ షోర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్టు పనులకు కూడా శంకుస్ధాపన చేసిన ముఖ్యమంత్రి.

*కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు

Related Posts

You cannot copy content of this page