బాల సదనమ్ (బాలికల) భవనానికి శంఖుస్థాపన చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు

Spread the love

సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని సినీ మల్టిపెక్స్ సమీపంలో నూతన “బాల సదనమ్ (బాలికల) భవనాన్ని మిషన్ వత్యల్య ₹ 134.93 లక్షల రూపాయల నిధులతో శంఖుస్థాపన చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ..

ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ సుల్తానాబాద్ పట్టణంలో బాల సదనమ్ బాలికల భవన నిర్మాణం కోసం శంఖుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే తల్లితండ్రులు లేనటువంటి అనాధలు అయిన 6 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు చిన్న పిల్లల కోసం ప్రభుత్వం మంచి ఆలోచనతో ఈ భవనాన్ని నిర్మించడం జరుగుతుంది. దాదాపు12 సంవత్సరాల పాటు ఆ పిల్లలకు రెసిడెన్సీ తో పాటు చదువుకునే విధంగా అన్ని సౌకర్యలతో నిర్మించడం జరుగుతుంది అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ ప్రభుత్వ అధికారులు మరియు మున్సిపల్ చైర్మన్ , జెడ్పీటీసీ,ఎంపీపీ, మున్సిపల్ వైస్ చైర్మన్ , మున్సిపల్ కౌన్సిలర్స్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page