ప్రతీ ఇంటికీ వివిధ సంక్షేమ పధకాలను చేర్చిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వానికే

Spread the love

ప్రతీ ఇంటికీ వివిధ సంక్షేమ పధకాలను చేర్చిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వానికే దక్కిందని, వెనుక బడిన కులాలకు ప్రయోజనం కలిగించే కార్యక్రమాలకు ప్రాముఖ్యతను కల్పిస్తున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు.

సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన బీ సీ కులాల లబ్దిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం సితాఫలమండీ క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీ సీ కులాలకు చెందిన వారికీ ఆర్ధికంగా ఉపకరించి, స్వయం ఉపాధిని కల్పించేందుకు వీలుగా లక్ష రూపాయల మేరకు ఆర్ధిక సహకారాన్ని అందిస్తున్నామని, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని ఈ ఆర్ధిక సహకార పధకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

ఈ పధకం లో డబ్బులు పొందేందుకు ఎవ్వరికీ లంచాలు చెల్లించాల్సి అవసరం లేదని పద్మారావు గౌడ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, ప్రజలకు నిరంతరం తాము అందుబాటులో ఉంటామని తెలిపారు. పేదలకు అనుకులించే తమ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు తెలపాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సూచించారు. కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ యువ నేతలు కిషోర్ కుమార్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 20 మంది లబ్దిదారులకు రూ. లక్ష మేరకు ఆర్ధిక సాయం చెక్కులను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అందించారు

Related Posts

You cannot copy content of this page