దళితుల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక పార్టీ బిఆర్ఎస్

Spread the love

దళితుల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక పార్టీ బిఆర్ఎస్ : ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ….

ఈరోజు సూరారం లోని బీమా గార్డెన్స్ లో ఎమ్మార్పీఎస్ టీఎస్ సుబ్బుల్లాపూర్ నియోజక వర్గ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మాదిగల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో బిఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ
75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోక స్వయం ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న దళితులను దళిత బంధు ద్వారా రుణాలను అందిస్తూ వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసిన ఏకైక పార్టీ బిఆర్ఎస్ మాత్రమేనని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. దళితుల అభ్యున్నతి, అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన బిఆర్ఎస్ పార్టీని మరో మారు భారీ మెజార్టీతో గెలిపించి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచాల యాదగిరి మాదిగ, బుడగ జంగాల 57 కులాల రాష్ట్ర అధ్యక్షులు రాజలింగం, రాష్ట్ర కార్యదర్శి సదుల మోహన్ పోలియో, నాయకులు దాసరి నరసింహ మాదిగ, బైండ్ల నరసింహ మాదిగ, జిల్లా అధ్యక్షులు కోహిర్ లాజర్ మాదిగ, ప్రధాన కార్యదర్శి వేముల హరి మాదిగ, డి వి ఐ సి మెంబర్ కే. కిషన్ రావు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ హనంకొండ ప్రేమ్ కుమార్ మాదిగ, కాటన్ దేవయ్య మాదిగ, దళిత సంఘాల ఐక్యవేదిక చైర్మన్ గట్టు అశోక్ మాదిగ, మాదిగ ఉపకులాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 21 At 6.46.52 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page