బహదూర్ పల్లి జిల్లా పరిషత్ హైస్కూల్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలలో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులు పంపిణీ

Spread the love

బహదూర్ పల్లి జిల్లా పరిషత్ హైస్కూల్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలలో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులు పంపిణీ చేసిన బీజేపీ నాయకుడు, కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ఆదేశాల మేరకు కేకేఎం ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బహదూర్ పల్లిలోని జిల్లా పరిషత్ హైస్కూల్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో బీజేపీ నాయకుడు, ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ సుమారు 900 మంది విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం, గొడుగులతో కూడిన కిట్లను పంపిణీ చేసారు.

ఈ సందర్బంగా బీజేపీ నేత, కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..తల్లిదండ్రుల జ్ఞాపకార్థం, తన సోదరులు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ , కూన జై కుమార్ గౌడ్ సహకారంతో కేకేఎం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకొని, జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోని తమ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పుట్టిన ఊరుకి మంచి పేరు తీసుకురావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు దాసరి శ్యామ్ రావ్, మల్లేష్ యాదవ్, శ్రీనివాస్, ఆకుల విజయ్ సాయి, భరత్ గౌడ్, రాజు, కెకేఎం ట్రస్ట్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page