స్థానిక సంస్థలలో మాదిరిగా చట్టసభలలో కూడా మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించి వారిని గౌరవించాలి

Spread the love

తెలంగాణ రాష్ట్ర భూగర్భ గనులు, పౌర సంబంధాలు మరియు సమాచార శాఖ మాత్యులు గౌరవ పట్నం మహేందర్ రెడ్డి , వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మరియు తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కోట్ పల్లి మండల కేంద్రంలో ర్యాలీలో పాల్గొని, బుగ్గాపూర్ గ్రామంలోని BMR ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కోట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు.

▪️నూతనంగా నియామకమైన చైర్ పర్సన్ మాణెమ్మ గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ మహమ్మద్ ఫయాజుద్ధిన్ మరియు పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

▪️ స్థానిక సంస్థలలో మాదిరిగా మహిళలకు చట్టసభలలో కూడా 50 శాతం రిజర్వేషన్ కల్పించి వారిని గౌరవించాలన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page