కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు పై మరో కేసు..

Spread the love

ఇప్పటికే అక్రమ భూదందా కేసులో అరెస్టు అయిన మాజీ సీఎం కేసీఆర్​ సోదరుడి కుమారుడు కన్నారావుపై మరో కేసు నమోదైంది… సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని బెదిరించి, గెస్ట్​హౌస్​లో నిర్భంధించి నగదు, బంగారం దోచుకున్నారు. అతడి ఫిర్యాదుతో బంజారాహిల్స్​ పోలీసులు కన్నారావు సహా మరో ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. కన్నారావు నందిని అనే మహిళతో కలిసి బెదిరింపులకు పాల్పడినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ సమస్య పరిష్కారం కోసం తనకు న్యాయం చేయాలని విజయవర్ధన్​ రావు అనే సాఫ్ట్​వేర్​ ఉద్యోగి కన్నారావు దగ్గరకు వెళ్లాడు. కన్నారావుకు నందిని అనే మహిళతో పరిచయం ఉంది. అలాగే విజయవర్ధన్​కు నందిని స్నేహితురాలు. అతని వద్ద భారీ మొత్తంలో డబ్బు, నగలు ఉన్నట్లు తెలుసుకున్న ఆమె ఎలాగైనా వాటిని కొట్టేయాలని భావించింది. ఓ సమస్య విషయంలో విజయవర్ధన్​ కన్నారావు వద్దకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన నందిని, కన్నారావు సాయంతో ఆ ఉద్యోగి వద్ద ఉన్న నగదు, బంగారం లాక్కోవాలని మాస్టర్ ప్లాన్ వేసింది. ఈ విషయం కన్నారావుకు తెలిపింది.
అలా ఓ రోజు విజయవర్దన్​ ను గెస్ట్​హౌస్​కు పిలిపించుకున్న ఆ మహిళ, కన్నారావు సహా మరికొంత మందితో కలిసి అతడిని బెదిరించారు. అతడి వద్ద ఉన్న రూ.60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోచుకున్నారు. తన సొమ్ము కోల్పోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తమకు పోలీసు అధికారి భుజంగరావు, ఏసీపీ కట్టా సాంబయ్య తెలుసునని బెదిరించినట్లు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page