ముఖ్యమంత్రి సభ గ్రౌండ్ ను పరిశీలన చేసిన ఏ సి పి, పార్టీ నాయకులు…

Spread the love

ACP and party leaders inspected the Chief Minister’s Sabha ground…

ముఖ్యమంత్రి సభ గ్రౌండ్ ను పరిశీలన చేసిన ఏ సి పి, పార్టీ నాయకులు…


సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల 29 న ఖమ్మం రానున్న నేపథ్యంలో ఆయన భద్రత ఏర్పాట్లు, మరియు అయన హాజరు అవుతున్న డిగ్రీ కాలేజీ గ్రౌండ్ ను ఖమ్మం ఏసీపీ ఆంజనేయులు మరియు సి పీ ఎం నాయకులు పరిశీలన చేశారు.

29న ఖమ్మం నగరం ఏస్ అర్& బి జీ న్ ఆర్ డిగ్రీ కాలేజీలో భారీ బహిరంగ సభ జరగబోతుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సభా వేదికను, ముఖ్యమంత్రి వచ్చే రహదారులపై ఏర్పాట్లపై ఏసిపి సూచనలు చేశారు. నగరంలోకి వచ్చే వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేయాలో సూచనలు చేశారు.

పెవిలియన్ గ్రౌండ్ నుంచి వచ్చే భారీ ర్యాలీకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని ఏసిపి అధికారులను ఆదేశించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై విక్రమ్ , టూ టౌన్ సీఐ శ్రీధర్ పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page