హస్తం పేదల నేస్తం: ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి

Spread the love

హస్తం పేదల నేస్తం అని, హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని చేవెళ్ల నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు. శంకర్‌పల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో రంజిత్ రెడ్డి మాట్లాడుతూ వంద రోజులలో ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పాలన సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయన్నారు. ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి తెలియపరచాలన్నారు.

చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జ్ భీమ్ భరత్ మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే రంజిత్ రెడ్డిని గెలిపించాలని, రంజిత్ రెడ్డిని గెలిపిస్తే చేవెళ్ల ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో పిసిసి సెక్రెటరీ ఉదయ్ మోహన్ రెడ్డి, ఐఎన్ టియుసి జనరల్ సెక్రెటరీ శేరి అనంతరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు ప్రకాష్, మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, జడ్పిటిసి గోవిందమ్మ గోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు రాములు, లావణ్య శ్రీనివాస్ రెడ్డి, చంద్రమౌళి, శ్రీనాథ్ గౌడ్, శ్వేతా పాండురంగారెడ్డి, నాయకులు ఎజాస్, కృష్ణారెడ్డి, రాజు గౌడ్, పెంటయ్య, ప్రవీణ్ కుమార్, శంకర్, రామచందర్, అస్లాం, రఘునందన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రమ్య రెడ్డి, నాగమణి, ప్రత్యూష రెడ్డి, పుష్పమ్మ, సుశీల, అమృత పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page