సుమారు 700 గ్రాముల గంజాయి స్వాధీనం ఒకరి అరెస్టు రిమాండ్ కు తరలింపు మదనపల్లి టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ జి యువరాజు

Spread the love
మదనపల్లి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో తమకు రాబడిన నమ్మకమైన సమాచారం మేరకు ఈ రోజు అనగా 16.02.24 సాయంత్రం  సుమారు మూడు గంటల సమయంలో ఒక వ్యక్తిని అదుపులోనికి తీసుకొని విచారించగా అతని పేరు రాహుల్ దాస్  వయస్సు 28 సంవత్సరాలు సుబాపల్లి  Kanker జిల్లా  Chattishgadh  రాష్ట్రం , గత రెండు సంవత్సరముల నుండి మదనపల్లి టౌన్ లోని ఎన్టీఆర్ సర్కిల్లో అభయ క్లినిక్ ద్వారా , మొలలు, ఫిస్టులా వాటికి ట్రీట్మెంట్ ఇస్తూ అలాగే అతని కీ ఉన్న గంజాయి త్రాగే అలవాటు ఉండటం వల్ల దానిని అప్పుడప్పుడు వారి ఊరు వద్ద నుండి తీసుకుని ఇక్కడ వాడుతూ ఉండేవాడు,  అందులో భాగంగా ఈరోజు కూడా వారి ఊరికి వెళ్లి గంజాయి తీసుకొని బస్టాండ్ దగ్గర నుండి  వస్తుండగా అతని వద్ద నుండి సుమారు 700 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు సిఐ గారు తెలియజేశారు. ఈ దాడుల్లో మదనపల్లి టూ టౌన్ ఎస్సై శ్రీ  వెంకటసుబ్బయ్య మరియు Station  సిబ్బంది పాల్గొన్నారని ఆయన తెలియజేశారు.

అలాగే మదనపల్లి టూ టౌన్ లిమిట్స్ లోని ప్రజలకు విన్నవించుకోవడమేమనగా మీకు ఎక్కడైనా గంజాయి లిక్కర్ సారాయి పేకాట బెట్టింగు మొదలగు జూదాలు ఎక్కడైనా ఉంటే ఈ నెంబర్లకు అనగా CI మదనపల్లి టూ టౌన్ 9491074519, SI మదనపల్లి టూ టౌన్ 9440796741 నంబర్లకు ఫోన్ చేయండి.

        Inspector,  

CI Madanapalli II town PS.

Related Posts

You cannot copy content of this page