అటవీ అధికారులు, సిబ్బందికి భరోసా కల్పించండి…. పోలీసులకు డిజిపి ఆదేశం

Spread the love

Provide assurance to forest officials and staff…. DGP orders to police

అటవీ అధికారులు, సిబ్బందికి భరోసా కల్పించండి…. పోలీసులకు డిజిపి ఆదేశం

హైదరాబాద్‌: అటవీ అధికారులు, సిబ్బందికి మద్దతుగా నిలవాలని, భరోసా కల్పించాలని పోలీసులను డీజీపీ మహేందర్‌ రెడ్డి అదేశించారు. కొత్తగూడెం లాంటి సంఘటలను పునరావృతం కాకుండా చూడాలని సూచించారు.

అటవీశాఖ, క్షేత్ర స్థాయి సిబ్బంది సమస్యలపై అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డోబ్రియల్‌తో కలిసి డీజీపీ మహేందర్‌ రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులు, ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా తమ పరిధిలోని చీఫ్ కన్జర్వేటర్లు, జిల్లా అటవీ అధికారులతో స్వయంగా సమావేశం కావాలని పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలకు సూచించారు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలన్నారు.

డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు కూడా తమ పరిధిలోని అటవీ అధికారులతో సమావేశం కావాలని ఆదేశించారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల రక్షణ, భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని అధికారులకు సూచించారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page