కెటీఆర్ చేతులమీదుగా 2వ విడత డబుల్ బెడ్ రూమ్ పంపిణి

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రివర్యులు కెటీఆర్ చేతులమీదుగా 2వ విడత డబుల్ బెడ్ రూమ్ పంపిణి…

పార్టీలకు అతీతంగా నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం – మంత్రి కేటీఆర్

*గడిచిన 9 ఏండ్లలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో కేటీఆర్ సహకారంతో వేల కోట్ల నిధులతో అభివృద్ధి – ఎమ్మెల్యే కె పి వివేకానంద్ *

రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కెసిఆర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు – మంత్రి కెటిఆర్..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ లో రెండో విడత డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణి కార్యక్రమానికి పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్‌ ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె పి వివేకానంద్ , కుక్కట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు ఎమ్మెల్సీ నవీన్ రావు ,మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జి మర్రి రాజా శేఖర్ రెడ్డి , కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందిత కలిసి ఇండ్లు పంపిణీ చేసారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన 9 ఏండ్లలో ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గంలో వేల కోట్ల నిధులతో అభివృద్ధి పనులను పూర్తి చేసుకున్నామని నియోజకవర్గం పరిధిలోని అర్హులైన నిరుపేదలకు పారదర్శకంగా డబల్ బెడ్ రూమ్ ఇండ్లను అందిస్తామని తెలిపారు.

ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని లక్కీ డ్రాలో పేరు రాని వారు నిరుత్సానికి గురికావద్దని, మిగతా వారికి కూడా ఇళ్లను ఇస్తామని తమ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేస్తాని తెలిపారు. పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా కెసిఆర్ నాయకత్వంలో ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రధమంగా నిలిచింది అని, గడిచిన 9 ఏండ్లలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు మంచినీటి గోస తీర్చమని, అభివృద్ధితో పాటు అనేక సంక్షేమ పథకాలను అందించామని, రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కెసిఆర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు, రాష్ట్రం లో జరుగుతున్న అభివృద్ధి పైన మాట్లాడే దమ్ములేకే ప్రతిపక్ష పార్టీలు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నాయని దుయ్యబట్టారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, జిఎచ్ఎంసి కమీషనర్ రోనాల్డ్ రోజ్, జోనల్ కమీషనర్ మమతా,నిజాంపేట్ మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధన్రాజ్ యాదవ్, దుండిగల్ మున్సిపాలిటీ చైర్మన్ సుంకరి సుంకరి వేణి కృష్ణ,వైస్ చైర్మన్ పద్మా రావు, కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్నా శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్, గంగయ్య, వివిధ విభాగాల అధికారులు, కౌన్సిలర్ లు, కార్పొరేటర్ లు , మున్సిపల్ డివిజన్ ల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులూ, మహిళా నాయకులూ లబ్ది దారులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page