టీడీపి,జనసెన,బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యం గా పనిచేస్తాం – వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్,

Spread the love

ఉయ్యూరు లోని మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ స్వగృహం నందు టీడీపి జన సేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి బోడే ప్రసాద్ తనకు అభ్యర్థిత్వం ఖరారైన సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ ని మర్యాద పూర్వకంగా కలిసి y.v.b. మద్దతు కోరడం జరిగింది.

ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన లో రాష్ట్ర ప్రజలు అన్ని రకాలుగా నష్టపోయారని,మళ్ళీ రాష్ట్రం బాగుపడి అభివృద్ధి చెందాలంటే టీడీపి,జనసెనా,బీజేపీ,పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చంద్రబాబు ని ముఖ్యమంత్రి ని చేసుకోవడమే ఏకైక లక్ష్యం గా పని చేయాలని అన్నారు,అదే విధంగా పెనమలూరు అభ్యర్థి బోడే ప్రసాద్ కి తన సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు,
అనంతరం బొడే ప్రసాద్ టీడీపి అభ్యర్థిత్వం ఖరారైన సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ బోడే ని శాలువాతో.సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అనుమొలు ప్రభాకర్ ,దేవినేని రాజా ,జంపన వీర శ్రీనివాస్, పూలా సయ్యద్ అజమతుల్లా , రోజులపాటి ఫణి, వెనిగల్ల కుటుంబరావు,ఖుద్దుస్,వాసు,పలియాల శ్రీను,పరిమి భాస్కర్,నరేష్,కుటుంబరావు,ఆప్పల నాయుడు, పైదియ్య,చాలపాటి శ్రీను,అల్ రియాజ్,తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page