తెలంగాణ ప్రభుత్వం లోనే యాదవ, కుర్మల కు ఎంతో మేలు

Spread the love
Yadav and Kurmala are very good in Telangana government

సాక్షిత : * తెలంగాణ ప్రభుత్వం లోనే యాదవ, కుర్మల కు ఎంతో మేలు జరిగిందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

వెస్ట్ మారేడ్ పల్లిలోని నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పలువురు యాదవ సంఘం నాయకులు ఈ నెల 26 వ తేదీన నిర్వహించిన యాదవ, కుర్మల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం కావడం పట్ల యాదవ సాంప్రదాయంలో మంత్రికి గొంగడి కప్పి సన్మానించారు

. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాదవులకు గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రాజకీయంగా అనేక అవకాశాలు కల్పించిందని తెలిపారు. ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించేలా ప్రభుత్వ పరంగా ఎంతో చేయూతను అందిస్తున్నదని తెలిపారు.

ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో యాదవ, కుర్మలు సభకు హాజరయ్యారని, తమ అభివృద్దికి ఎంతో కృషి చేస్తున్న TRS వెంటే యాదవులు, కుర్మలు ఉంటారని వారు అన్నారు. మంత్రిని సన్మానించిన వారిలో యాదవ సంఘం యాదాద్రి జిల్లా అద్యక్షులు అయోధ్య యాదవ్, నాయకులు కడారి అంజయ్య యాదవ్, శ్రీశైలం యాదవ్, రాంమోహన్ యాదవ్ లు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page