ప్రజలకు మేలు చేసే TRS ప్రభుత్వం

Spread the love


TRS Govt that works for people

సాక్షిత : ప్రజలకు మేలు చేసే TRS ప్రభుత్వం ను ఆశీర్వదించి KCR నాయకత్వాన్ని బలపర్చాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు.

LB నగర్ లోని పిండి పుల్లారెడ్డి గార్డెన్ లో ఏర్పాటు చేసిన హైదరాబాద్ లో నివాసం ఉంటున్న మునుగోడ్ నియోజకవర్గ పరిధిలో గల నాంపల్లి కి చెందిన ఓటర్ల ఆత్మీయ సమ్మేళనం లో నాంపల్లి ఎన్నికల ఇంచార్జి, మంత్రి శ్రీనివాస్ యాదవ్ పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల సమగ్ర అభివృద్ధి జరిగిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని చెప్పారు.

మునుగోడ్ ఉప ఎన్నిక రాజగోపాల్ రెడ్డి స్వార్ధం వలన వచ్చిందనే విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు వచ్చిందని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్న TRS పార్టీ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు.

నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం తెలంగాణ ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుందన్నారు. MLA గా మూడున్నర సంవత్సరాలలో చేయని అభివృద్దిని ఇప్పుడు చేస్తానంటే ఎలా నమ్ముతారని అన్నారు. ఓటమి ఖాయమనే నిర్ణయానికి వచ్చి రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారని, BJP నేతల మాయమాటలు నమ్మి మోసపోవద్దని కోరారు.

ఈ సమావేశంలో ఎన్నికల పర్యవేక్షకుడు, MLC బోడకుంటి వెంకటేశ్వర్లు, TRS అధికార ప్రతినిధి కర్నాటి విద్యా సాగర్, TRS నాయకులు గుర్రం ముద్దగాని రాంమోహన్ గౌడ్, గుర్రం పవన్ కుమార్ గౌడ్, సత్తయ్య, వెంకట్ రెడ్డి, కృష్ణారెడ్డి, వెంకన్న గౌడ్, మాజీ కార్పొరేటర్ లు చంద్రశేఖర్, సామా ప్రభాకర్ రెడ్డి, విట్టల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page