రైతులందరికీ రైతు భరోసా అమలు చేస్తాం

Spread the love

200 యూనిట్ల వరకు బిల్లు కట్టాల్సిన పనిలేదు
సంఘం బండ పూర్తి చేస్తాం ముందు చూపుతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జల యజ్ఞం చేపట్టింది

కృష్ణ,గోదావరి జలాలను మళ్లించే శక్తి సామర్థ్యాలు, ఆలోచన కలిగిన నాయకుడు ఉత్తంకుమార్ రెడ్డి
మక్తల్ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

ఈ రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు. కొండలు రాళ్లు, రోడ్లకు,భూస్వాములకు కాకుండా సాగు చేసుకుంటున్న నిరుపేదలకు రైతు భరోసా అందాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం. అందుకే మొదట ఒక్క ఎకరం తో మొదలుపెట్టి మూడు ఎకరాల వరకు రైతులకు నగదు జమ చేశాం తాజాగా 4 ఎకరాల రైతులకు డబ్బులు వేయడం మొదలుపెట్టాం త్వరలోనే మిగిలిన రైతులందరికీ నగదు జమ చేస్తామన్నారు. అర్హత కలిగిన నిరుపేదలు 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే బిల్లు కట్టాల్సిన పని లేదన్నారు. ఎవరైనా లబ్ధిదారుల పేర్లు పొరపాటున లిస్టులో రాకపోయినా బిల్లు కట్టాల్సిన పనిలేదని వారిని ఒత్తిడి చేయొద్దని మా అధికారులకు స్పష్టంగా చెప్పినట్టు భట్టి భరోసా ఇచ్చారు. లిస్టులో రాణి అర్హులు ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి మీ కరెంట్ బిల్లు , తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు అందించి జీరో బిల్లు జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందే చేస్తుంది… చేసేదే చెబుతుంది అన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచాం, మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని ప్రారంభించాం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించాం. ముందే చెప్పాం మొదలు పెట్టామన్నారు.

ఇటీవలే భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ముందుచూపుతోనే ఈ రాష్ట్రంలో జలయజ్ఞం కార్యక్రమాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. అందులో భాగంగానే 70 వేల ఎకరాలకు నీరు అందించే సంఘం మండ బాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం జరిగిందన్నారు. బండ పగలగొడితే 25 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని స్థానిక ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ కోరారు. బండ పగిలి గలగల నీరు పారుతుంటే అంతకంటే ఆనందం ఏముంటుందని డిప్యూటీ సీఎం అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే గత 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కటి పూర్తి కాలేదన్నారు. పైన రిజర్వాయర్ కింద కాలువలు పూర్తయిన ఒక బండ పగలగొట్ట లేకపోయినా చరిత్ర గత ప్రభుత్వాన్ని అన్నారు. వారి నిర్లక్ష్యం మూలంగా నీళ్లు లేక పదేళ్లపాటు ఈ ప్రాంత రైతులు పంటలను ఎండబెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. కృష్ణ గోదావరి దక్కన్ పీఠభూమి అర్థం చేసుకున్న నాయకుడు జల వనరుల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. సుదీర్ఘకాలం పిసిసి అధ్యక్షునిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఉత్తంకుమార్ రెడ్డి కృష్ణ, గోదావరి జలాలను మళ్ళించే శక్తి సామర్థ్యాలను ఆలోచన కలిగిన నాయకుడన్నారు.

పాలమూరు ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఈ ప్రాంతం పై ఆయనకు పూర్తి అవగాహన ఉందన్నారు. పాలమూరు సమస్యలు తెలిసే జూరాల నుంచి కొడంగల్ నారాయణపేట ప్రాంతాలకు ఎత్తిపోతల ద్వారా కృష్ణ నీళ్లు మళ్లించే కార్యక్రమాన్ని ప్రారంభించారని డిప్యూటీ సీఎం తెలిపారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పాలమూరు ఎంపీ అభ్యర్థిగా అఖిలభారత కాంగ్రెస్ కమిటీ డాక్టర్ వంశీచందర్ రెడ్డిని ప్రకటించింది. వంశీని గెలిపించండి మీకు ఇచ్చిన హామీలన్నిటిని పూర్తిచేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ఇందిరమ్మ రాజ్యం మక్తల్కు అండగా ఉంటుందన్నారు. వంశీచందర్ రెడ్డి విద్యార్థి యువజన నాయకుడిగా ఎదిగారని తెలిపారు. వంశీ గెలవక ముందే వందల కోట్ల నిధులు పాలమూరుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు గెలిచాక ఏ ఎంపీ చేయని విధంగా వంశీ పని చేస్తాడు అన్న పూర్తి నమ్మకం తనకుందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ ప్రాంతానికి పరిశ్రమలు రావాలి విద్యార్థులు చదువుకోవాలి నిరుద్యోగులకు ఉపాధి దొరకాలి అనే ప్రణాళికలు చేయగలిగిన చదువుకున్న వ్యక్తి వంశీ ఎంపీ అయితే ఈ ప్రాంతానికి ఇంతకన్నా ఎక్కువ ఏమీ ఉంటుంది అన్నారు. 33/11కేవీ సబ్ స్టేషన్, దేవరకద్రలో డిగ్రీ కళాశాల వంటి పనులన్నిటిని పూర్తి చేస్తామన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page