మార్కాపురం పట్టణంలోని పంచాయతీరాజ్ అతిథి గృహం నందు విముక్త చిరుతల కక్షి ,వి సీ కే పార్టీ

Spread the love

మార్కాపురం పట్టణంలోని పంచాయతీరాజ్ అతిథి గృహం నందు విముక్త చిరుతల కక్షి ,వి సీ కే పార్టీ జిల్లా అధ్యక్షులు పత్రిక సమావేశం ఏర్పాటు చేసి జిల్లా కమిటీలో నూతన సభ్యులను నియమించి కమిటీలో కి సాదరంగా ఆహ్వానించారు నియామక పత్రాలు అందించడం జరిగింది. ఈ యొక్క విసికె పార్టీలో జిల్లా అధ్యక్షులు గారైన మీడసల ఆదినారాయణ మార్కాపురం నియోజకవర్గానికి చెందిన నూతలపాటి రాజు గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన బోయిలపల్లి శివకుమార్ దర్శి నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి శేషయ్య ను నియమించడం జరిగింది.

ఈ సందర్భంగా విముక్త చిరుతల కక్షి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు రాజకీయ పార్టీలలో ప్రముఖ స్థానం లేక అగ్రవర్ణ పార్టీలలో నలిగిపోతున్నారని వారందరికీ ప్రముఖ స్థానం కల్పించేందుకే విసికె పార్టీ ఆవిర్భవించిందని తెలపడం జరిగింది పశ్చిమ ప్రకాశంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాబోయే 2024 ఎలక్షన్లో మూడు నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను నియమించి ఆగ్రావర్ణ పార్టీలకు దీటుగా పోరాడి అభ్యర్థులను గెలిపించుకుంటామని మరియు ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్రంలో మరియు పశ్చిమ ప్రకాశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పై దాడులు జరుగుతున్నాయని వాటిని వీసీకే పార్టీ సమర్థవంతంగా ఎదుర్కొంటామని మరియు విసీకే పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు తమిళనాడు ఎంపీ గారైన డాక్టర్ తోల్ తిరుమవలవన్ తో రాష్ట్ర అధ్యక్షులు అయిన విద్యాసాగర్ తో పశ్చిమ ప్రకాశంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో విసీకే పార్టీ ఉపాధ్యక్షులు తుమాటి అచ్చయ్య దళిత హక్కుల పరిరక్షణ సమితి డివిజన్ అధ్యక్షులు జనుమాల నాగయ్య మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కల్వకూరి అబ్రహాము మరియు ఆవులమంద రవి బోయలపల్లి రాజారావు ఆలేటి దుర్గాప్రసాద్ దేవరాజు గట్టు ఏడుకొండలు తదితరులు పాల్గొనడం జరిగింది. జై భీమ్ జై విసీకే పార్టీ

Related Posts

You cannot copy content of this page