ఆపద లో ఉన్నామంటే చాలు ఆపద్బాంధవుల సహాయం చేస్తున్న ఊరుకొండ ఎస్సై లక్ష్మణ్

Spread the love

Urukonda SS Laxman is helping many people who are in danger

ఆపద లో ఉన్నామంటే చాలు ఆపద్బాంధవుల సహాయం చేస్తున్న ఊరుకొండ ఎస్సై లక్ష్మణ్


సాక్షిత ఉర్కొండ: మండలంలోని మాధారం గ్రామానికి చెందిన అంకురి ఇస్తారి అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానికులతో తెలుసుకున్న ఊరుకొండ ఎస్సై లక్ష్మణ్ తన వంతు సహాయంగా ఆ కుటుంబానికి సహాయం చేయడం జరిగింది.

ఆపదలో ఉన్నామంటే చాలు తన సొంత జీతం డబ్బులతో సహాయం చేసే ఏకైక వ్యక్తి ఊరుకొండ ఎస్సై లక్ష్మణ్. ఎవరికైనా ఆపద వచ్చిందంటే చాలు నేనున్నానంటూ సహాయం చేసే గొప్ప వ్యక్తి. ఎవరికైనా ఆపద జరిగితేమనకెందుకులే అనే ఈ రోజులో తెలిసిన వారు సమాచారం ఇవ్వడంతో వెంటనే బాధిత కుటుంబానికి అండగా ఉంటానని, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.

మూడు వేల రూ.3000/- అందజేశారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఆపదలో ఆదుకుంటున్న ఉరుకొండ మండల ఎస్సై లక్ష్మణ్ కి గ్రామస్తులు ఎల్లవేళలా అండగా ఉంటామని, మాకు ఇలాంటి ఎస్సై మండలానికి ఉండడం ఎంతో గర్వకారణమని తముఅదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.

ఎవరికి ఏ ఆపద వచ్చిన ముందుకు వచ్చి నేనున్నానంటూ ఆదుకుంటున్న మనసున్న మహారాజుల సహాయం చేస్తున్న ఊరుకొండ ఎస్సై లక్ష్మణ్ కి ప్రజల దీవెనలు ఉండాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ మల్లేష్ .క్రాంతి. హోమ్ గార్డ్ బాలు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారుతదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page