బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా

Spread the love

బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తున్న జగనన్న ప్రభుత్వం

పలువురికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు.

చిలకలూరిపేట: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు అన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో పలువురికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రాజేష్ నాయుడు శుక్రవారం చిలకలూరిపేట పట్టణంలోని నియోజకవర్గ ఎన్నికల కార్యాలయంలో పంపిణీ చేశారు. సందెపూడి గ్రామానికి చెందిన బొగ్గవరపు ప్రకృతికి1,10,000లు, పురుషోత్తమ పట్నంకు చెందిన ఆశా కమలాదేవికి 45,000లు, జాలాది గ్రామానికి చెందిన కూరాకుల సంపత్ రావులకు మంజూరైన రూ.25,000ల చెక్కులను రాజేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లెల రాజేష్ నాయుడు మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తోందని పేర్కొన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో వైద్యం, విద్యకు సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని, రాష్ట్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారు భయపడవద్దని ప్రభుత్వం తరపున ఆర్ధిక సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఎవరైనా బాధితులు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోవచ్చునని ఈ సందర్భంగా రాజేష్ సూచించారు. కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page