రూ.8.50 లక్షలతో సీసీ రోడ్డు అభివృద్ధి చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన కాలనీ వాసులు..

Spread the love

రూ.8.50 లక్షలతో సీసీ రోడ్డు అభివృద్ధి చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన కాలనీ వాసులు…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని వెంకటాద్రి నగర్ కాలనీ రోడ్ నెంబర్ 10కు చెందిన కాలనీ వాసులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రూ.8.50 లక్షలతో సీసీ రోడ్డు పూర్తి చేయించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా అవసరాలకు అనుగుణంగా కాలనీల్లో మెరుగైన సేవలు అందించడమే తన లక్ష్యం అన్నారు. నిధులకు కొరత లేకుండా ప్రతీ కాలనీ, బస్తీని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో లింగయ్య, వి.చంద్రశేఖర్, రాజు, శ్రీనివాస్, చంద్రశేఖర్, రూపేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page