గడప గడప కు మన ప్రభుత్వ కార్యక్రమంలో రేషన్ డీలర్ ను స్పాట్లో సస్పెండ్

Spread the love

The ration dealer has been suspended on the spot in our government program

గడప గడప కు మన ప్రభుత్వ కార్యక్రమంలో రేషన్ డీలర్ ను స్పాట్లో సస్పెండ్ చెయ్యమని ఏ.ఎస్.ఓ కు ఆదేశాలు ఇచ్చిన ఎమ్మెల్యే భూమన


సాక్షిత తిరుపతి* : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 33వ డివిజన్ కొర్లగుంట మెయిన్ రోడ్డు లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శనీయమన్నారు. అందుకే నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నామని తెలిపారు.


కొర్లగుంట మెయిన్ రోడ్ లో గడపగడప కార్యక్రమంలో మహిళలు గత ఆరు నెలల నుండి చక్కెర, కందిపప్పు ఇవ్వడం లేదని, బియ్యం మాత్రమే ఇస్తున్నారని ఎమ్మెల్యే కి మహిళలు ఫిర్యాదు చేశారు. వెంటనే రేషన్ డీలర్ కుమార్ ను సస్పెండ్ చెయ్యమని చరవాణి ద్వారా ఏ.ఎస్.ఓను ఆదేశించారు

. అక్కడున్న మహిళలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్లు కుమారి, రామస్వామి వెంకటేశ్వర్లు, నగరపాలక అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, వైసీపీ నాయకులు దొడ్డ రెడ్డి సిద్ధారెడ్డి, శివకుమార్, శేఖర్, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page