వాహనాల తనిఖీలను ముమ్మరం చేసిన పోలీసులు..

Spread the love

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈసి ప్లయింగ్ స్క్వాడ్ తోపాటు పోలీసు అధికారులు కూడా వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు అందులో భాగంగా ప్రకాశం బ్యారేజ్ తాడేపల్లి పరిదిలో గల చెక్ పోస్ట్ మార్గంలో రాకపోకలుసాగించే వాహనాలను తాడేపల్లి పోలీస్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆదివారం తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వాహనాన్ని మరియు నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ వాహనాన్ని కూడా పోలీసు వారు తనిఖీలు చేసి పంపించేసారు.ఈ తనిఖీలు ఎన్నికల కోడ్ అమలులోఉన్నంతవరకు కొనసాగుతుంది ..


ఎన్నికల నియమావలికి ఉల్లఘంన జరిగినట్లయితే సామాన్య ప్రజల సైతం ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చెందుకు ఎన్నికల సంఘం సి విజిల్ యాప్ తో పాటుగా టోల్ ఫ్రీ నెంబర్ 1950 ని అందుబాటులోకి తీసుకువచ్చింది ఎక్కడైనా ఎవరైనా ఓటర్లు మభ్యపెట్టుటకు మద్యం, మందు పంచిన సంఘటనలు వారి దృష్టికి వచ్చినట్లైతే పైన తెలిపినటువంటి యాప్ నందు మరియు నేరుగా టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇవ్వవచ్చునని ఈసి తెలియజేసింది.

Related Posts

You cannot copy content of this page