కేసుల్లో శిక్షల శాతం పెంచాలి

Spread the love

The percentage of punishment in cases should be increased

జోగుళాంబ గద్వాల్ పోలీస్.
కేసుల్లో శిక్షల శాతం పెంచాలి

ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలి

కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలి.

ఫోక్సో ఎస్సీ ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి, 60 రోజుల్లో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలి.

రౌడీలు, కేడీలు సస్పెక్ట్ ల యొక్క కదలికలపై నిరంతరం నిఘాపెట్టాలి.

పెండింగ్ కేసులపై సమీక్ష సమావేశం లో జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్

జిల్లా లో ఆయా పోలీస్ స్టేషన్ లలో నమోదు అయి పెండింగ్ లో ఉన్న కేసులలో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ను పెంపొందించి సత్వర పరిష్కారం కు బాధ్యతగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్ పోలీస్ అధికారులకు సూచించారు.


ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎస్పీ నెలవారీ నేరసమీక్షా సమావేశం నిర్వహించి ఓల్డ్ UI, గ్రేవ్ కేసులు, ST,SC కేసులు, కాంటెస్టెడ్ కేసులపై రివ్యూ నిర్వహించారు మరియు నమోదు అయిన కేసులలో శిక్షల శాతం ను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల పై సమీక్ష నిర్వహించడం జరిగింది.పెండింగ్ ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ– జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి పోలీసు అధికారులందరూ న్యాయధికారులతో సమన్వయం పాటిస్తూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

పెండింగ్ కేసులను పూర్తిస్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి డిస్పోజల్ చేయాలని సూచించారు. ఫోక్సో ఎస్సీ ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలి.ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలి మరియు పూర్తి పారదర్శకంగా కేసులో ఇన్వెస్టిగేషన్ చేయాలి,

పెండింగ్ ఉన్న సీసీ త్వరగా తీసుకోవాలని సూచించారు. కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలి, కేసుల్లో శిక్షల శాతం పెంచాలని అన్నారు. పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసులలో 60 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలి, రౌడీలు, కేడీలు, సస్పెక్ట్ ల యొక్క కదలికలపై నిరంతరం నిఘాపెట్టాలి, ప్రతి కేసులో ప్రతి కేసులో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలన్నారు.

సైబర్ నేరాల్లో త్వరితగతిన పరిశోధన పూర్తి చేయాలన్నారు. టార్గెట్ పెట్టుకొని పెండింగ్ ఉన్న కేసులను తగ్గించాలన్నారు. దొంగతనాల కేసుల్లో ప్రతిరోజు కేసు చేదన గురించి అన్ని కోణాల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎస్ఓపి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి కేసులు ఛేదించాలని సూచించారు.

ఈ పెట్టి కేసులు వెంటనే డిస్పోజల్ చేయాలని సూచించారు. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పై ద్రుష్టి సారించాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. రాత్రి పెట్రోలింగ్ అధికారులు లాడ్జిలు మరియు పాత నేరస్తులను తనిఖీ చేయాలని తెలిపారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. సిసిటిఎన్ఎస్ లో డాటా ఎంట్రీ ప్రతిరోజూ మానిటర్ చేయాలని సంబంధిత ఎస్ఐలకు సూచించారు. సీసీ కెమెరాలను ప్రతిరోజూ మానిటర్ చేయాలని పని చెయ్యని సీసీ కెమెరాలను వెంటనే బాగు చేయించాలని సూచించారు.

వర్టికల్ వారిగా ఎంట్రీ చేసిన డాటాను నోడల్ అధికారులు ప్రతిరోజు తనిఖీ చేసుకోవాలని క్వాలిటీ డాటా ఎంట్రీ చేయాలని సూచించారు. మరియు విధినిర్వహణలో రోల్ క్లారిటీ, గోల్ క్లారిటీ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణ గురించి గ్రామాలలో పట్టణాలలో మరియు ప్రజలకు ప్రజాప్రతినిధులకు యువకులకు గ్రామాల విపిఓలు, పోలీస్ అధికారులు, సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ఈ సమావేశంలో ఈ సమీక్షా సమావేశం లో డి. ఎస్పీ శ్రీ ఎన్. సి హెచ్ రంగ స్వామి , ఎస్బి, డీసీ ఆర్బి, సీసీ ఎస్ ఇన్స్పెక్టర్స్ శివ కుమార్ , శ్రీనివాస్ , వెంకటేశ్వర్లు , గద్వాల్ సి. ఐ చంద్ర శేఖర్ , అలంపూర్ సి. ఐ సూర్య నాయక్ , జిల్లా లోని అన్నీ పోలీస్ స్టేషన్ ల ఎస్సై లు, ఏ
ఎస్సై దేవరాజు, సిబ్బంది ఐటీ సెల్ ఇంచార్జి నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page