దేశ భవిష్యత్తు విద్యార్థుల మీద ఆధారపడి ఉంది.

Spread the love

దేశ భవిష్యత్తు విద్యార్థుల మీద ఆధారపడి ఉంది.
డాక్టర్ సి అంజిరెడ్డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్

పదవ తరగతి విద్యార్థులకు కెరియర్ గైడ్స్ అందించిన శ్రీమతి గోదావరి అంజిరెడ్డి ఎస్ ఆర్ ట్రస్ట్ అధ్యక్షురాలు

పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం పట్టణంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రైవేటు పాఠశాల ఠాగూర్ స్కూల్ అక్షర స్కూల్ మొదలగు పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు కెరియర్ గైడ్స్ ఎస్ ఆర్ ట్రస్ట్ ద్వారా అందించిన ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సి అంజి రెడ్డి మరియు వారి సతీమణి ఎస్ ఆర్ ట్రస్ట్ అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి .

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ భవిష్యత్తు విద్యార్థుల మీద ఆధారపడి ఉందని అదే విధంగా విద్యార్థులకు సరైన అవగాహన కోసం కెరీర్ గైడ్ అందించడం జరుగుతుందని, అదేవిధంగా విద్యార్థులందరూ ఈ కెరియర్ ని ఉపయోగించుకొని సరైన మార్గాన్ని ఎంచుకొని ఉన్నత స్థాయికి రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అక్షర పాఠశాల పాధ్యాయులు రమేష్ , టాగూర్ హై స్కూల్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ స్రవంతి మరియు స్కూల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page