శ్రీ ఆంజనేయ స్వామి కోదండ రామస్వామి దేవస్థానం హుండీ లెక్కింపు

Spread the love

నంద్యాల న్యాయం న్యూస్ మార్చి 20 రిపోర్టర్ సీఎం నాగేంద్ర….

నంద్యాల జిల్లా నంద్యాల టౌన్ లో వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండరామ స్వామి దేవస్థానం నందు 20-3-2024. వ తేదీన హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగినది ఈ లెక్కింపు కార్యక్రమం నందుహుండీ ఆదాయం..553906/-( ఐదు లక్షల 53 వేల 906 రూపాయలు ) వచ్చినది ఈ ఆదాయము. 12 నెలలకు వచ్చినది. గత సంవత్సరము కంటే. ఈ సంవత్సరందేవస్థానం యొక్క ఆదాయము13434/-( 13 వేల 4 వందల 34 రూపాయలు ) ఆదాయం అధికంగా వచ్చినది. ఈ దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమమునకు దేవాదాయశాఖ తనిఖీ అధికారి శ్రీ ఎస్ శశి కుమార్ . దేవస్థానం చైర్మన్ శ్రీ చెన్న వెంకటేశ్వర్లు మరియు ధర్మకర్తలు శ్రీమతి నల్లబోతుల విజయలక్ష్మి. శ్రీమతిచిన్న మాతంగి జిమ్మీస్వరి .ఎర్రగుంట లక్ష్మీదేవి ఎం జయసుబ్బడు మరియు దేవస్థానం ప్రధాన అర్చకులు జీవి సుబ్బయ్య .మరియు బాలాజీ సేవా ట్రస్ట్ సభ్యులు మహిళా మండలి సభ్యులు. పట్టణ పెద్దలు పట్టణ ప్రజలు. పాల్గొనడం జరిగినది. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం లో పాల్గొన్న భక్తులందరికీ దేవస్థానం కార్యనిర్వాహణాధికారి. టి రామాంజనేయ శర్మ. ధన్యవాదాలు తెలియజేశారు

Related Posts

You cannot copy content of this page