నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో NMC ఇంజినీరింగ్,టౌన్ ప్లానింగ్ అధికారులతో,సిబ్బందితో ప్రత్యేక సమావేశం

Spread the love

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ రావు, కార్పొరేటర్లతో కలిసి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో NMC ఇంజినీరింగ్,టౌన్ ప్లానింగ్ అధికారులతో,సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా నిజాంపేట్ కమాన్ నుండి బాచుపల్లి వరకు రోడ్ విస్తరణ పనులలో భాగంగా చేపట్టవలసిన చర్యలు,అనుసరించాల్సిన విధి విధానాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.అదే విధంగా కార్పొరేషన్ పరిధిలో ఆయా డివిజన్లలో పూర్తి అయిన నిర్మాణ అభివృద్ధి పనులు,జరుగుతున్న అభివృద్ధి పనులు, పెండిగ్ దశలో ఉన్న పనులు,వాటి పూర్తి పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో కార్పొరేటర్లు సురేష్ రెడ్డి,బాలాజీ నాయక్,ఆయా విభాగాల అధికారులు మరియు సిబ్బంది ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page