మాకు రోడ్డు సమస్యను పరిష్కరించండి

Spread the love

మాకు రోడ్డు సమస్యను పరిష్కరించండి
యర్రగొండపాలెం : యర్రగొండపాలెం పట్టణంలోని ఎస్టీ కాలనీలోని నివసిస్తున్న దాదాపు 300 కుటుంబాలకి సరైన రోడ్డు మార్గం లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఇటీవల ఆ కాలనీలో మిద్దె మీద నుంచి ఒక చిన్న బాబు పడితే ఆంబులెన్స్ కూడా రావడానికి మార్గంలేక ఆ బాబుని ఎత్తుకొని రోడ్డు పై దాకా కాలనీవాసులు తీసుకువెళ్లి అక్కడి నుండి హాస్పిటల్ కి తీసుకువెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగితే అగ్నిమాపక కేంద్రం బండి రావడానికి కూడా సరైన మార్గం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ కాలనీలో బడుగు బలహీన వర్గాల వారు నివసిస్తున్నారు.

వారి సమస్యని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారికి పలుమార్లు వినుముంచుకున్నారు. ఆయన ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కానీ ఈ సమస్యను పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు శనివారం నాడు ఆ కాలనీవాసులు మంత్రి సురేష్ ని కలిసేందుకు ఆయన గెస్ట్ హౌస్ కి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు మా సమస్యను పరిష్కరించాలని కోరారు. మంత్రి సురేష్ మీ కాలనీకి వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తానని అన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page