శాసనసభ్యులు జిఎంఆర్ దంపతులకు సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గౌడ్ ప్రత్యేక బహుమతి

Spread the love

పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన వందమంది జర్నలిస్టులకు ఒకేసారి ఇళ్లపట్టాలను అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. పటాన్చెరు నియోజకవర్గ సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గౌడ్ శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దంపతులకు ప్రత్యేక బహుమతిని అందజేశారు. అలాగే ఆయనతోపాటు జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ దంపతులకు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్ దంపతులకు బహుమతులను అందజేశారు.

ఈ సందర్భంగా శేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో వంద మంది జర్నలిస్టులకు ఒకేసారి ఇలా పట్టాలను అందజేయడం గర్వించాల్సిన విషయమని అన్నారు. గతంలోనూ నియోజకవర్గంలోని జర్నలిస్టులకు తన సొంత నిధులతో మూడు సంవత్సరాల ఆరోగ్య బీమా అందించిన ఘనత ఎమ్మెల్యే జిఎంఆర్ కే దక్కుతుందని కొనియాడారు.

భవిష్యత్తులోనూ ఇలాగే వారి వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ జర్నలిస్టులకు ఉండాలని కోరారు.

Related Posts

You cannot copy content of this page