పలు అభివృద్ధి పనుల పర్యవేక్షణ సబీహా గౌసుద్దీన్

Spread the love

పలు అభివృద్ధి పనుల పర్యవేక్షణ…

సబీహా గౌసుద్దీన్

కూకట్పల్లి నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ లో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్, 85 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సున్నం చెరువు పార్కు అభివృద్ధి పనులను మరియు 25 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న గాయత్రి నగర్ సీనియర్ సిటిజన్ కమిటీ హాల్ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గౌరవ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి సహాయ సహకారాలతో డివిజన్ పరిధిలోని పార్కులు కమ్యూనిటీ హాల్ లు భారీ నిధులతో పనులు పూర్తి చేసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గాయత్రి నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు సంజీవరెడ్డి, కాశీనాథ్ చారి, వెంకటేశ్వర్లు, మాధవాచారి, రవీందర్ రెడ్డి, యోగి రాజు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page